పటాన్చెరు, ఫిబ్రవరి 14 : ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
అనంతరం టీఆర్ఎస్వీ నాయకులు సోహెల్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంకా ఊరేగింపులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించారు.
కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్, పార్టీ పట్ణణ అధ్యక్షుడు అప్జల్, సీనియర్ నాయకులు విజయ్కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.