Uttar Pradesh | లక్నో, ఏప్రిల్ 26: ఉత్తరప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. డీ ఫార్మసీ పరీక్షలో ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు, క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను పాస్ చేశారు.
ఇద్దరు విద్యార్థుల ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమను పాస్ చేసేందుకు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లను వీసీ డిస్మిస్ చేశారు.