హనుమకొండ చౌరస్తా, జూలై 15: కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 22న ‘వికసిత్ భారత్-2047లో అకౌంటింగ్, ఫైనాన్స్ పాత్ర’పై నిర్వహించనున్న జాతీయ సదస్సు పోస్టర్లు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ డైరెక్టర్ ఆచార్య కట్ల రాజేందర్, కాన్ఫరెన్స్ కన్వీనర్ పసునూరి అమరావేణి మాట్లాడుతూ దేశాభివృద్ధి లక్ష్యాల సాధనలో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల పాత్ర, సమకాలీన ఆర్థిక సవాళ్లు, విధానపరమైన మార్పులు, స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థల ప్రాధాన్యత వంటి అంశాలపై ఈ సదస్సులో నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ బి.వెంకట్రామరెడ్డి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నరసింహచారి, బి.సురేష్లాల్, పి.వరలక్ష్మి, ఫణీంద్ర, గిరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.