హైదరాబాద్: కృష్ణా, గోదావరీ నదీ బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ (Jalashakthi Ministry) కార్యదర్శి సమీక్ష నిర్వహించున్నారు. ఉభయ బోర్డుల చైర్మన్లతో నేడు వర్చువల్ విధానంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతి, ప్రాజెక్టుల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు.
కాగా, కృష్ణానదీ యాజమాన్య బోర్డు రెండు రోజులపాటు ప్రాజెక్టులను పరిశీలించనుంది. కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై నేతృత్వంలో ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఇందులోభాగంగా గురువారం జూరాల టెలిమెట్రీ స్టేషన్లను పరిశీలిస్తారు. శుక్రవారం ఆర్టీఎస్, సుంకేశుల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పరిశీలిస్తారు.