డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ తమ పార్టీ విజయం సాధించి అధికారం చేపడితే.. ఉమ్మడి పౌర స్మృతి తీర్మానం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పెండ్లిళ్లు, వివాకులు, భూమి, ఆస్తి తగాదాలు మతాలతో సంబంధం లేకుండా ఏకీకృతంగా రూల్స్ ఉండే రీతిలో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురానున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ తెలిపారు. యూనిఫామ్ సివిల్ కోడ్తో రాష్ట్ర ప్రజలందరికీ సమాన హక్కులు లభిస్తాయని ఆయన అన్నారు. ఉమ్మడి పౌర స్మృతితో సామాజిక సామరస్యత పెరుగుతుందని, లింగ సమన్యాయం జరుగుతుందని, మహిళా సాధికారత సాధించవచ్చు అని, సాంస్కృతి, ఆధ్మాతిక, పర్యావరణ ఐడెంటిటీని రక్షించుకోవచ్చు అని సీఎం పుష్కర్ చెప్పారు.