కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 6 : ముంబై జాతీయ రహదారి పక్కన నగర శివారు ప్రాంతామైన కూకట్పల్లి.. హైటెక్సిటీ రాకతో శరవేగంగా అభివృద్ధి చెందింది. హైటెక్సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం, ఉద్యోగ ఉపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు నగరానికి వలస వచ్చారు. దీంతో కూకట్పల్లి ట్రాఫిక్ చిక్కుల్లో పడింది. కేపీహెచ్బీ కాలనీ, మూసాపేట, బాలానగర్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగిపోవడంతో గంటల కొద్ది నిరీక్షించాల్సిన వచ్చేది. కూకట్పల్లిలో ట్రాఫిక్ చిక్కులను తప్పించి వాహనదారులకు దూరభారాన్ని తగ్గించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోచోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, మరోచోట అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించింది.
మూడుచోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిలు..
కాలనీ జేఎన్టీయూహెచ్ చౌరస్తా నుంచి హైటెక్సిటీకి వెళ్లే మార్గంలో నెక్సెస్మాల్ (రాజీవ్గాంధీ) చౌరస్తా వద్ద నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడేవి. ఈ సమస్య పరిష్కారం దిశగా రూ.84 కోట్లతో ఆరు వరుసలతో కూడిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. రోడ్డుకిరువైపులా సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేశారు. మరోవైపు రాజీవ్గాంధీ చౌరస్తాను ట్రాఫిక్ ఐల్యాండ్గా తీర్చిదిద్దగా ఈ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలన్నీ తీరాయి.
నుంచి హైటెక్సిటీకి రాకపోకలు సాగించాలంటే కాలనీ 4, 7వ ఫేజ్ల చివరన రైల్వే పట్టాలు దాటాలి. ఈ పట్టాలు దాటేందుకు 1 ఫ్లైఓవర్తో పాటు ఒకే వాహనం వెళ్లిగలిగే చిన్న అండర్పాస్ బ్రిడ్జి ఉండేది. నిత్యం లక్షలాది వాహణాలు రాకపోకలు సాగిస్తుండగా గంటల కొద్ది ట్రాఫిక్ ఇబ్బందులు కలిగేవి. ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించేందుకు కాలనీ 7వ ఫేజ్ సమీపంలో రూ.64 కోట్లతో రైల్వే అండర్పాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తేవడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ చిక్కులు తొలిగాయి.
కాలనీ హైటెక్సిటీ మార్గంలోని ఫ్లైఓవర్, అండర్పాస్ బ్రిడ్జిల గుండా లక్ష్మలాది వాహనాలు వెళ్తుండడంతో హైటెక్సిటీ చౌరస్తాపై ట్రాఫిక్ ఒత్తిడి పెరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా బాలాజీనగర్ కైత్లాపూర్ నుంచి మాదాపూర్ వరకు రూ.135 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి ని నిర్మించారు.
నర్సాపూర్ చౌరస్తా అంటేనే ఒకప్పుడు వాహనదారులు బెంబేలెత్తేవారు. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయేవి. ఈ సమస్యను అధిగమనించేందుకు ప్రభుత్వం రూ.390 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించింది. ఫ్లైఓవర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు, జంక్షన్ను అభివృద్ధి చేయడంతో నేడు వాహనదారులు హాయిగా ఈ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఐదేండ్ల క్రితం ఈ చౌరస్తాను చూసినవారు నేడు ఆ చౌరస్తా అభివృద్ధిని చూస్తే ఇదికదా అభివృద్ధి అని సంతోషపడుతున్నారు.
బేగంపేట రోడ్డులో రూ.60 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి, బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి సనత్నగర్ మార్గంలో రూ.40 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించే పనులు సాగుతున్నాయి.అంబేద్కర్ వై జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే దిశగా రూ.135 కోట్లతో అండర్పాస్ బ్రిడ్జిని నిర్మించేందుకు పనులను చేపట్టనున్నారు.