డబ్లిన్: ఐర్లాండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నిజానికి ఆ మ్యాచ్లో ఇండియా నెగ్గినా.. ఐర్లాండ్ మాత్రం ఆ హైస్కోర్ గేమ్లో కేక పుట్టించింది. దాదాపు విక్టరీ వరకు వచ్చింది. కానీ చివరి ఓవర్లో 17 రన్స్ కావాల్సి ఉండగా ఆ కీలక ఓవర్ను ఉమ్రాన్ మాలిక్ వేశాడు. అయితే ఉమ్రాన్కు ఎందుకు ఆ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందో కెప్టెన్ హార్థిక్ పాండ్యా పోస్టుమ్యాచ్ ప్రెస్కాన్ఫరెన్స్లో తెలిపాడు. స్పీడ్ బౌలింగ్లో పరుగులు రాబట్టడం అంత సులువు కాదు అని, అందుకే ఉమ్రాన్పై నమ్మకంతో ఆ ఓవర్ను అతనికి ఇచ్చినట్లు పాండ్యా చెప్పాడు. యమ దూకుడుమీదున్న ఐర్లాండ్ బ్యాటర్లను ఉమ్రాన్ మాలిక్ ఆ ఓవర్లో కట్టడి చేశాడు. ఓ నో బాల్ వేశాడు. వరుసగా రెండు బౌండరీలు ఇచ్చుకున్నాడు. కానీ కూల్గా ఆ ఓవర్ను వేసి కేవలం 12 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆ ఉత్కంఠ మ్యాచ్లో ఇండియా నాలుగు రన్స్ తేడాతో నెగ్గింది. వత్తిడికు దూరంగా ఉండాలని ప్రయత్నించానని, ఉమ్రాన్కు చివరి ఓవర్ ఇచ్చానని, అతని వద్ద పేస్ ఉందని, ఆ పేస్లో 18 రన్స్ కొట్టడం సులువు కాదని, కానీ వాళ్లు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారని, ఐరిస్ బ్యాటర్లు ఆకట్టుకున్నారని, మన బౌలర్లు కూడా రాణించినట్లు పాండ్యా తెలిపాడు.