IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా(Team India)కు ఊహించిన విధంగా పెనాల్టీ పడింది. ఐసీసీ నియమాల ప్రకారం అంపైర్ జోయల్ విల్సన్(Joel Wilson) రోహిత్ సేనకు 5 పరుగుల జరిమానా విధించాడు. భారత జట్టు ఇన్నింగ్స్ 102వ ఓవర్లో అంపైర్ విల్సన్ పెనాల్టీ కింద ఇంగ్లండ్ 5 పరుగులు ప్రకటించాడు. అతడు సిగ్నల్ ఇవ్వడం చూసిన అశ్విన్కు ఒక్కసారి ఏం జరిగిందో అర్థం కాలేదు. దాంతో, అతడి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు.
రన్ తీసే క్రమంలో పిచ్ మీదుగా పరిగెత్తినందున పెనాల్టీ విధిస్తున్నట్టు విల్సన్ తెలిపాడు. మొదటి రోజు కూడా అంపైర్ పెనాల్టీ గురించి వార్నింగ్ ఇచ్చాడు. మళ్లీ అదే పొరపాటును భారత ఆటగాళ్లు రెండో రోజు కూడా చేయడంతో అతడు ఇంగ్లండ్కు 5 పరుగులు ఇచ్చాడు. దాంతో, బెన్ స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్ను 5\0తో ఆరంభించనుంది.
It’s Lunch on Day 2 of the third Test! #TeamIndia added 62 runs to their overnight score to move to 388/7.
Stay Tuned for the Second Session! ⌛️
Scorecard ▶️ https://t.co/FM0hVG5pje #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ocM5rdcpL4
— BCCI (@BCCI) February 16, 2024
వైజాగ్ టెస్టు విజయంతో జోరుమీదున్న టీమిండియా రాజ్కోట్లోనూ రఫ్ఫాడిస్తోంది. తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ(132), రవీంద్ర జడేజా(112)శతకాలతో భారీ స్కోర్ చేసిన భారత్ రెండో రోజు తొలి సెషన్లో తడబడింది. ఓవర్నైట్ స్కోర్ తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. కుల్దీప్(4)ను అండర్సన్ బోల్తా కొట్టించగా.. లోకల్ బాయ్ జడ్డూను రిటర్న్ క్యాచ్తో రూట్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత అశ్విన్(25 నాటౌట్) అరంగేట్రం కుర్రాడు ధ్రువ్ జురెల్(31 నాటౌట్) బాధ్యతగా ఆడారు. ఎనిమిదో వికెట్కు 57 పరుగులు జోడించారు. దాంతో, లంచ్ సమయానికి టీమిండియా 388 రన్స్ కొట్టింది.