బెంగళూరు, నవంబర్ 18: రవాణా సదుపాయాల సంస్థ ఊబర్..వరంగల్లో తన సేవలు ఆరంభించింది. దీంతో దేశంలో సేవలు ఆరంభించిన వందో నగరంగా వరంగల్ నిలిచిందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ప్లాట్ఫాంలో ఆటోతోపాటు కారు సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. 2013లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థ అనతికాలంలో ఇంచుమించు అన్ని నగరాలకు తన సేవలు విస్తరించింది. ఇప్పటి వరకు 9.5 కోట్ల మంది ఊబర్ సేవలు వినియోగించుకున్నారు. ప్రస్తుతం 100 నగరాల్లో సేవలు అందిస్తున్న సంస్థ..200 నగరాలకు తమ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.