ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా పేసర్ రాజ్ బవా తన పేస్తో ఇంగ్లండ్ జట్టు నడ్డి విరుస్తున్నాడు. అతని ధాటికి ఇంగ్లండ్ జట్టు 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. వీటిలో నాలుగు వికెట్లు రాజ్ బవానే తీశాడు. మరో పేసర్ రవి కుమార్ కూడా సత్తా చాటాడు. అతను రెండు వికెట్లు తీశాడు.
వీరి ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు జార్జ్ థామస్ (27), జాకబ్ బెథెల్ (2), కెప్టెన్ టాప్ ప్రెస్ట్ (0), విలియమ్ లక్స్టన్ (4), జార్జ్ బెల్ (0), రెహాన్ అహ్మద్ (10), అలెక్స్ హార్టన్ (10) క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. జేమ్స్ ర్యూ (50 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
ప్రస్తుతం అతనికి జోడీగా జేమ్స్ సేల్స్ (10 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రాజ్ బవా, రవి కుమార్తోపాటు స్పిన్నర్ కుశాల్ టెంబే ఒక వికెట్ తీశాడు. మొత్తం 30 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు 114/7 స్కోరుతో నిలిచింది.