యాదాద్రి భువనగిరి : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని సస్పెన్షన్ వేటు వేశారు. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆర్ కవిత, భువనగిరి మండలం నాగినేనిపల్లి ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎం వెంకట్రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలలను పునః ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. స్పెషల్ ఆఫీసర్లు విజిట్ చేసిన సందర్భంలో పాఠశాలలు మూసివేసి ఉండడమే కాకుండా, విధులకు గైర్హాజరుకావడంతో ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, డీఈఓ కార్యాలయంలో డీఎల్ ఎంపీగా పని చేస్తున్న ఎల్లయ్యపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందున డీఈఓ చర్యలు తీసుకున్నారు.