Pangolin : అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్ (Pangolin) ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న పంగోలిన్ను స్వాధీనం చేసుకున్నారు. పంగోలిన్ను అక్రమంగా తరలిస్తున్నారని తమకు అందిన పక్కా సమాచారం మేరకు తాము నిఘా వేసి నిందితులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రం రాయ్పూర్ (Raipur) లో స్మగర్లను పట్టుకున్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు.
పంగోలిన్లు, పులి చర్మాలు, ఏనుగు దంతాలను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో తాము నిఘా పటిష్టం చేశామని రాయ్పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రప్రకాశ్ మహోబియా అన్నారు. మూడు వారాలు ముఠాను వెంబండించి కొనుగోలుదార్లుగా నటించి పట్టుకున్నామని చెప్పారు. అయితే కొందరు తమకు తాము అమ్మడానికి వచ్చామని, వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో తమకు తెలియదని స్మగ్లర్లు చెప్పినట్లు వెల్లడించారు. కాగా, అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న ఈ పంగోలిన్ను తెలంగాణలో అలుగు అంటారు.
#WATCH | Raipur, Chhattisgarh: Two smugglers caught with live pangolin in an operation conducted by the Forest Department. https://t.co/7B85WJGb95 pic.twitter.com/PdT9K2P2Sa
— ANI (@ANI) April 22, 2026