హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హరితావరణం విస్తరణకు కొత్తగా నాటే మొక్కల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా రెండు మీటర్ల పొడవుండే మొకలను నాటనున్నారు. వీటిని సరఫరా చేసేందుకు వీలుగా మాడల్ నర్సరీలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ యోచిస్తున్నది. ఈ ఏడాది ఒకో నర్సరీకి సుమారు రూ.10 కోట్లతో రెండు మాడల్ నర్సరీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చెంగిచర్లలో ఒక నర్సరీని ప్రతిపాదించగా, 50 హెక్టార్లలో విస్తరించి ఉన్న మరో నర్సరీని ఏర్పాటు చేయడానికి శాఖ అధికారులు స్థలాన్ని అన్వేషిస్తున్నారు. కనీసం 1.5 మీటర్ల నుండి 2 మీటర్ల ఎత్తులో ఉండే పొడవైన, నాణ్యమైన మొకలను సరఫరా చేయాలనే ఆలోచనలో అటవీశాఖ ఉన్నట్టు పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. అవెన్యూ, వాణిజ్య, దేశీయ పండ్ల చెట్లతో సహా అన్ని రకాలు ఈ మాడల్ నర్సరీలలో ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. అడవులు, సంప్రదాయక తోటలతో పాటు, ప్రభుత్వం రోడ్ల పకన ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్దఎత్తున చేపడుతున్నట్టు చెప్పారు. ఎర్రచందనం వంటి వాణిజ్య రకాలను సాగు చేసి, ఆదాయాన్ని పొందడంపై కూడా అటవీశాఖ దృష్టి పెడుతున్నదని పేర్కొన్నారు. కోతుల బెడదను అదుపులో ఉంచేందుకు పండ్లచెట్ల పెంపకం, తోటల పెంపకంపై దృష్టి పెడుతున్నామని అన్నారు. ప్రతిపాదిత మాడల్ నర్సరీలు ఈ అవసరాలన్నింటినీ తీరుస్తాయని డోబ్రియాల్ చెప్పారు.