హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర లిఫ్టర్లు రెండు పతకాలతో మెరిశారు. టోర్నీలో రాజశ్రీ(63కి) రజతం దక్కించుకోగా, సాయి లలిత్(105కి) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల జూనియర్ 63కిలోల విభాగంలో రాజశ్రీ 320 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలువగా, గుర్మిత్కౌర్(367.5కి), నిమ్రాషేక్(260కి) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా , వైస్ ప్రెసిడెంట్ రంగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.