ఇచ్చోడ, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు హతమయ్యారు. ఎంపీటీసీ, సర్పంచ్ మధ్య నెలకొన్న వివాదం వల్ల జరిగిన గొడవలో ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల ఎంపీటీసీ, సర్పంచ్ మధ్య కొన్నేండ్లుగా పాతకక్షలు నెలకొనగా.. వీరు రెండు గ్రూపులుగా విడిపోయారు. బుధవారం ఉర్సు సందర్భంగా ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. సర్పంచ్ వర్గం వారు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో చేసిన దాడిలో ఎంపీటీసీ వర్గానికి చెందిన అన్నదమ్ములు షేక్ జైరొద్దీన్(65), షేక్ ఝూహా(60) మృతి చెందా రు. షేక్ సిరాజ్, షేక్ వజీమ్ల పరిస్థితి విషమంగా ఉన్నది. వీరిని చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఇం చార్జి ఎస్పీలు రాజేశ్చంద్ర, ప్రవీణ్కుమార్, ఉ ట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు బలగాలతో గుండాలకు చేరుకున్నా రు. గ్రామాన్ని అదుపులోకి తీసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.