సంగారెడ్డి: జీహెచ్ఎంసీ శివార్లలోని పటాన్చెరులో (Patancheru) జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు వద్ద ఓ కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా టోలిచౌకి నుంచి సంగారెడ్డిలోని ఓ దాబాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో బైక్పైనుంచి పడి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మరణించాడు. పటాన్చెరూ పాత టోల్గేట్ వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయికృష్ణ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.