అమరావతి : ఏపీ ప్రకాశం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి వద్ద లారీ, కారు ఢీకొట్టుకున్నాయి. సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఇదే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో కారులోనే రెండు మృతదేహాలు ఇరుక్కుపోయాయి. మృతులు మార్కాపురంవాసులుగా తెలిసింది. కంభం నుంచి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.