శాయంపేట, ఫిబ్రవరి 1: దళిత మహిళకు డబుల్ ధమాకా తగిలింది. ఒకేసారి రెండు కల్యాణలక్ష్మి చెక్కులు అందుకొని సంబురపడింది. హనుమకొండ జిల్లా శాయంపేటలోని దళిత కాలనీకి చెందిన అక్కపాక ప్రమీలకు నలుగురు కుమార్తెలు. గత ఏడాది మే నెలలో ఒకరికి, జూలైలో మరో అమ్మాయి వివాహం జరిపించింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకొన్నది. మంజూరైన ఈ రెండు చెక్కులను వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మంగళవారం ప్రమీల ఇంటికి వెళ్లి అందజేశారు. చెక్కులు అందుకొన్న ప్రమీల ఆనందంతో మురిసిపోతూ.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది.