హైదరాబాద్ : పార్క్ చేసిన కార్ల టైర్లు దొంగిలించి ఆన్లైన్లో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను నగరంలోని ఎల్బీనగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, 47 కార్ల టైర్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. అరస్టైన వ్యక్తులను ఎం.శ్రీకాంత్(24), జి.బాలకిషన్(25)గా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన కార్లు డ్రైవర్లు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని 29 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు.
ఇంటి ముందు పార్క్ చేసిన కార్లను దొంగతనం చేసేవారు. ఇప్పటివరకు రూ.7 లక్షల విలువైన 68 టైర్లను దొంగిలించారు. నకిలీ నంబరు ప్లేట్తో ఉదయం వేళల్లో కారులో కాలనీల్లో తిరుగుతూ రాత్రి దొంగతనానికి పాల్పడేవారు. నాగోల్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.