శ్రీనగర్ : వరుస భూకంపాలు జమ్మూకశ్మీర్ను వణికిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి గంట వ్యవధిలో కత్రాలో వరుస భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. మొదట రాత్రి 11.04 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రత భూకంపం సంభవించింది. ఆ తర్వాత 11.52 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 3.2 తీవ్రతో ప్రకంపనలు వచ్చాయని సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కత్రాకు 60 కిలోమీటర్ల దూరంలో దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అంతకు ముందు మహారాష్ట్రలోని కొల్హాపూర్లోనూ భూకంపం సభవించింది. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఆరు భూకంపాలు సంభవించాయి.