రాంచీ: జార్ఖండ్లోని డియోఘర్లో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అయితే ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 16 గంటల పాటు ఆ కేబుల్ కార్లలో సుమారు 48 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాబా బైద్యనాథ్ ఆలయం సమీపంలో ఉన్న త్రికూట పర్వతాల వద్ద ఉన్న కేబుల్ కార్స్ తెగిపోయినట్లు భావిస్తున్నారు. మొత్తం 12 కేబుళ్లలో 50 మంది చిక్కుకున్నట్లు తెలిసింది. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సాంకేతిక కారణాల వల్ల రెండు కేబుల్ కార్స్ ఢీకొన్నాయి. కేబుల్ కార్ నుంచి దూకేందుకు ప్రయత్నించిన ఇద్దరు భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం బరిలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్లో రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు నిమగ్నమైనట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
#WATCH | A recce was conducted by one of the helicopters in the morning and operations are underway in coordination with the district administration and NDR to rescue people from ropeway site near Trikut in Deoghar, Jharkhand pic.twitter.com/Mum5Tq73nq
— ANI (@ANI) April 11, 2022