తిరుమల : ఈ నెలలో నాలుగు రోజులకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. గత నెలలో ఆగస్ట్ మాసానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో బుకింగ్కు అవకాశం ఇవ్వలేదు. ఆయా రోజుల్లో పవిత్రోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోటాను విడుదల చేయలేదు. తిరిగి ఆయా తేదీల కోటాను బుధవారం విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆయా తేదీలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఇవాళ ఉదయం 10గంటలకు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. రోజుకు ఎనిమిదివేల చొప్పున టికెట్ల కోటాను విడుదల టీటీడీ విడుదల చేయనుంది.