తిరుపతి : టీటీడీ గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గోశాలలోని వేణుగోపాలస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గోమాత, దూడకు అర్చకుల మంత్రాల నడుమ నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గోమాత, దూడకు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారు. గోమాత పాలు పితికి వాటిని తీసుకుని వెళ్లి అర్చకులకు అందించి అభిషేకం చేయించారు. అనంతరం వేంకటేశ్వర మహామంత్ర పుస్తక జపసమర్పణ (7 కోట్ల సార్లు ఓం నమోః వేంటేశాయ ) ఆలయాన్ని సందర్శించి అక్కడి పుస్తకంలో ఓం నమో వేంకటేశాయ అని రాశారు. సీవీఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీ ఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, వీజీఓ మనోహర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.