తిరుమల,జూన్ 8: టీటీడీ శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు టిటిడి కల్పించింది. అయితే సంవత్సరం లోపు ఒకసారి మాత్రమే ఈవిధంగా మార్పునకు అవకాశం ఉంటుంది. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో భక్తులుఈ అవకాశం ఈ ఏడాది డిసెంబర్ లోపు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.