హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా మహిళల జూడో ర్యాంకింగ్ టోర్నీలో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కేరళలో జరుగుతున్న ఈ పోటీల్లో గురుకుల పాఠశాలలకు చెందిన జూడోకాలు 6 పతకాలతో మెరిశారు. ఇందులో రెండు రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. అనూష, అక్షిత సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకోగా.. నక్షత్ర రెండు కాంస్యాలు, స్పందన, గంగోత్రి చెరో కాంస్యం చేజిక్కించుకున్నారు.