హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించినట్టు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) తెలిపింది. ప్రతి బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు బేగంపేటలోని టూరిజంప్లాజా నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. వెళ్లేటప్పుడు శనిసింగనాపూర్, వచ్చేటప్పుడు అజంతా ఎల్లోరాను సందర్శించేలా టూర్ రూపొందించారు. షిర్డీలో ఒక రాత్రి బస ఏర్పాటుచేస్తారు. మూడ్రోజులపాటు సాగే ఈ టూర్కు పెద్దలు రూ.3,250, పిల్లలు రూ.2,060 చెల్లించాలి. షిర్డీ సాయిబాబా దర్శనం టికెట్లను ఎవరికివారే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని టీఎస్టీడీసీ ఎండీ మనోహర్రావు తెలిపారు. ఆలయ అధికారులు కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, ఫొటో గుర్తింపుకార్డు అడుగుతున్నందున టీఎస్టీడీసీ తరఫున దర్శనం టికెట్లు బుక్చేయడం లేదని పేర్కొన్నారు.