ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బలోపేతాని కి, ప్రజా రవాణా సదుపాయాన్ని మరింత విస్తరించేందుకు విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన పుష్పక్ బస్సులో రాజీవ్గాంధీ ఎయిర్పోర్టు నుంచి పంజాగుట్ట వరకు ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై నిమ్స్లో చికిత్స పొందుతున్న డ్రైవర్ అంజయ్యను పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పా రు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. సజ్జనార్ వెంట ఈడీ వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ యుగేందర్ ఉన్నారు.