హైదరాబాద్, జనవరి 26 : టీఎస్ ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలు, ప్రయాణికులు తమ విలువైన అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. బుధవారం బస్భవన్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ నూతన వెబ్సైట్ (tsrtc.telangana. gov.in) ను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి ఆయన ప్రారంభించారు. వెబ్సైట్ను ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించామని, సామాన్య ప్రజలు కూడా దీనిని సులభంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ & సంస్థ కార్యదర్శి) పురుషోత్తం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.