హుజూరాబాద్ : పేదింటి బిడ్డ..ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని టీఎస్ జాక్ ఓయూ చైర్మన్ భాస్కర్ కోరారు. మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా ఓయూ జాక్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహచర ఉద్యమకారుడు, పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడం స్వాగతిస్తున్నామని అన్నారు. ఉద్యమంలో కీలకంగా ఉన్నవాడు, నియోజకవర్గ బిడ్డ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
బీజేపీ ప్రభుత్వ విధానం ఏడేండ్లుగా ఏవిధంగా ఉందో మనం చూస్తున్నామని, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఒకరకంగా , అధికారంలో లేని రాష్ట్రాలలో ఒకవిధంగా పరిపాలన చేస్తుందని వివిమర్శించారు. బీజేపీ సెంటిమెంట్తో ప్రజలను మభ్యపెడుతుందని, నిఖార్సయిన గెల్లు శ్రీనివాస్కు మద్దతు తెలుపాలని కోరారు. ఈటల లెఫ్టాలజీ అన్నాడు..ఆస్తుల రక్షణకోసమే బీజేపీలో చేరాడని ప్రజలకు తెలిసిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓయూ జాక్ అధ్యక్షులు ఎల్చాల దత్తాత్రి, జనరల్ సెక్రటరీ రవీందర్నాయక్, ఎస్ఎఫ్ఎస్జె అధ్యక్షుడు అశోక్యాదవ్, టీవీఎస్ అధ్యక్షుడు హరీష్గౌడ్ , శాతవాహన యూనివర్సిటీ జాక్ చైర్మన్ సీహెచ్ చైతన్య, అంసా ప్రధానకార్యదర్శి దాసరి నారాయణ, ఎంజెఎస్ ఉపాధ్యక్షుడు సేపూరి ప్రణయ్, ఎంబీసీ విద్యార్థి సంఘం ప్రధానకార్యదర్శి చిరంజీవి బెస్త, తదితరులు పాల్గొన్నారు.