హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు మొదలుపెట్టి మే మొదటివారం వరకు కొనసాగించాలని భావిస్తున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు నిర్వహిస్తామని గతంలో ఇంటర్బోర్డు ప్రకటించింది. అయితే, ఇటీవల నిర్వహించిన ఫస్టియర్ పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు దాదాపు నెల పట్టింది. తరగతులు అంతంత మాత్రంగానే జరిగాయి. సిలబస్ పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో నెల రోజులు ఆలస్యంగా షెడ్యూల్ను రూపొందించి, మంత్రి సబితాఇంద్రారెడ్డికి పంపించి, అనుమతి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.