హైదరాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకొని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఎంపీ సంతోష్కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.