స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్దే అని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీలైన ఇద్దరికీ తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించి నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడంతో పాటు కొత్తవి నిర్మించారు. సాగునీటి వసతితో వ్యవసాయం పండుగలా సాగుతున్నదని చెప్పారు. దీంతో వలసల జిల్లాకే వలసొస్తున్నారని తెలిపారు.
మహబూబ్నగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికలేవైనా గె లుపు టీఆర్ఎస్దేనని ఎక్సైజ్, పర్యాటక శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దా మోదర్రెడ్డికే తిరిగి అవకాశం లభించిందన్నారు. వీరు విజయం సాధించడం ఖా యమని చెప్పారు. మంగళవారం మ హబూబ్నగర్ కలెక్టరేట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కశిరె డ్డి, కూచకుళ్ల నామినేషన్లు వేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చెప్పారు. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా గులాబీ పార్టీదే గెలుపు అని అన్నారు. రా ష్ట్రంలో 100 శాతం జెడ్పీ చైర్పర్సన్లు, 90 శాతం ఎంపీటీసీ లు, 80 శాతం కౌన్సిలర్లు అధికార పార్టీకి చెందిన వారే ఉ న్నారని తెలిపారు. గ్రామాలు, పట్టణాలకు తేడా లేకుండా జరుగుతున్న అభివృద్ధి వల్లే టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 14 రోజులకోసారి తాగునీరు వచ్చేవని.. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతిరోజూ శుద్ధజలం అందిస్తున్నామన్నారు. సమైక్య పాలనలో కరెంట్ అడిగితే కాల్చి చంపారని గుర్తు చేశారు. 14 లక్షల మంది వలసలు వెళ్లేలా సమైక్య పాలన సాగిందని తెలిపారు.
కానీ నేడు ఏపీ, కర్ణాటక నుంచి మహబూబ్నగర్ జిల్లాకే వలస వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి ఉమ్మ డి జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పారు. సి ట్టింగ్ వారికే ఎమ్మెల్సీలుగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీలు వాణీదేవి, జనార్దన్రెడ్డి, జె డ్పీ చైర్పర్సన్లు సరిత, వనజ, పద్మావతి, స్వర్ణమ్మ, లోకనాథ్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
10 నామినేషన్లు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం
ఉమ్మడి జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల కోసం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అధికార పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వీరితోపాటు మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం ఒక స్వతంత్ర అభ్యర్థి.. మంగళవారం ఏడుగురు స్వతంత్రులుగా నామినేషన్లను సమర్పించారు. మొత్తంగా 10 మంది అభ్యర్థులు.. 16 సెట్ల నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి, మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో సుమారు 90 శా తానికిపైగా అధికార పార్టీ సభ్యులే ఉండడంతో.. ప్రతిపక్షాలు ఎన్నికల బరిలో నిలిచే సాహసం చేయలేదు. బుధవారం నా మినేషన్ల పరిశీలన, 26వ తేదీ వరకు ఉపసంహరణ ఉండ గా.. వచ్చేనెల 10న ఎన్నికలు, 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.