హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ను ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? అని ప్రశ్నించారు. దేశం అంటే మట్టి మాత్రమే కాదు అని ఆమె పేర్కొన్నారు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏంటని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని నిర్మలా సీతారామన్ను కవిత ప్రశ్నించారు.
కెసిఆర్ గారి ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పండి గౌరవ @nsitharaman
గారు.. లాభాల్లో ఉన్న @LICIndiaForever ను ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా?దేశం అంటే మట్టి మాత్రమే కాదు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు,రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్తితి ఏమిటి #IndiaReacts pic.twitter.com/EtBffDFIzQ— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 3, 2022