అత్యధిక ఓట్లతో విజయం
నల్లగొండ ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి గులాబీ జెండా ఎగిరింది. శనివారం రాత్రి జరిగిన తుది లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించిన పల్లా ఎలిమినేషన్ రౌండ్స్లో లెక్కించిన తదుపరి ప్రాధాన్యత ఓట్లలోనూ అదే ఊపును కొనసాగించారు. ఫైనల్గా సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై విజయం సాధించారు. పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,61,811 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపులో ఆది నుంచి మూడో స్థానంలో కొనసాగిన కోదండరామ్ చివరకు ఎలిమినేట్ అయ్యారు. దీంతో కోదండరామ్కు వచ్చిన ప్రథమ ప్రాధాన్యత బ్యాలెట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా అత్యధిక ఓట్లు పల్లాకు లభించాయి. దీంతో పల్లా గెలుపు సంబురాలు అంబరాన్నంటాయి.
ఆది నుంచి పల్లా ఆధిక్యం
ఈ నెల 17వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటికీ ఓట్ల లెక్కింపు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఏడు రౌండ్లలో చేపట్టిన తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ అత్యధిక ఓట్లను సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్రెడ్డి మొత్తం 1,10,840 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లతో ద్వితీయ స్థానంలో, కోదండరామ్ 70,072 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్, సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్, రాణీరుద్రమరెడ్డి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే.. మొత్తం పోలైన ఓట్లలో 21,636 చెల్లని ఓట్లు పోగా మిగిలిన 3,66,333 ఓట్లలోంచి సగానికి ఒకటి ఎక్కువ అంటే 1,83,167ను గెలుపు కోటాగా నిర్ధారించారు.
69 మంది ఎలిమినేషన్
తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ ఇన్ని ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో తదుపరి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తొలి ప్రాధాన్యతలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరుగా ఎలిమినేట్ చేస్తూ వారి బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఎవరికి వస్తే వారికి పంచుతూ వచ్చారు. మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 69 మంది ఎలిమినేట్ అయ్యారు. బరిలో నిలిచిన 62 మంది స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి మొత్తం 5,966 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మిగిలిన 9 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు 3,60,377 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్ రౌండ్స్లో బయటకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బ్యాలెట్ పేపర్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్రెడ్డికి 22,081, తీన్మార్ మల్లన్నకు 24,963, కోదండరామ్కు 32,958 ఓట్లు వచ్చాయి. వీటిని ప్రథమ ప్రాధాన్యత ఓట్లకు కలుపగా పల్లాకు మొత్తం 1,32,921ఓట్లు, మల్లన్నకు 1,08,253, కోదండరామ్కు 1,03,030 ఓట్లు వచ్చాయి. దీంతో మూడో స్థానంలో ఉన్న కోదండరామ్ను ఎలిమినేట్ చేశారు. ఆయన బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పల్లాకు, మల్లన్నకు పంపిణీ చేశారు. ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్రెడ్డి తన ఆధిక్యతను ప్రదర్శించారు. అయినా సరే మరోసారి ఎలిమినేషన్ పద్ధతిని అనుసరిస్తూ మల్లన్న బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. వీటిలో పల్లాకు వచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో ఆయనకు స్పష్టమైన మెజారిటీ లభించింది. దీంతో పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం పరిపూర్ణమైంది. పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు బాటలో ఉన్నాడన్న సమచారం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు సాయంత్రం నుంచే సంబురాలకు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బాణసంచా కాలుస్తూ భారీగా సందడి చేశారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
విజేతలకు శుభాకాంక్షలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీవినీ ఎరగని విజయం సాధించిన ఎస్ వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డికి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్పై నమ్మకంతో ఆయన సూచించిన అభ్యర్థులకు భారీగా ఓట్లు వేసిన పట్టభద్రులకు కృతజ్ఞతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు.
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష
సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు చాటిచెప్పారు. జాతీ య పార్టీలను తిరస్కరించి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు మరోమారు బలపరిచారు. కేసీఆర్కు తెలంగాణ అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదు. వాణీదేవి గెలుపుతో పీవీ నరసింహారావుకు ఘనమైన నివాళి లభించినట్టయింది.
ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలి
పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీ దేవి గెలుపును చూసైనా ప్రతిపక్షాలు బుద్ధితెచ్చుకోవాలి. ఎమ్మెల్సీలు గా గెలిచిన వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్ల నమ్మకం ఉంచి ఓట్లేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ విజయం ఉద్యోగులు, పట్టభద్రులది.
ఇది పట్టభద్రుల విజయం
ఇది పట్టభద్రుల విజయం. ఎమ్మెల్సీగా వాణీదేవిని గెలిపించిన పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు. వాణీదేవికి శుభాకాంక్షలు. పార్టీ విజయానికి కృషిచేసినవారికి పేరుపేరునా ధన్యవాదాలు.
సరైన సమయంలో సరైన తీర్పు
తెలంగాణ ప్రజలు సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకొని టీఆర్ఎస్ వైపు నిలబడతారని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చీరావడంతోనే ఎమ్మెల్సీగా ఎన్నికైన వాణీదేవికి, రెండోసారి ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్రెడ్డికి శుభాకాంక్షలు.
వాణీదేవికి శుభాకాంక్షలు
ఎమ్మెల్సీ వాణీదేవికి శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్దేశంతో టీఆర్ఎస్ గెలుపొందేందుకు సహకరించిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులకు ధన్యవాదాలు. అన్నివర్గాల సమస్యలకు టీఆర్ఎస్ తప్పకుండా పరిష్కారం చూపుతుంది.
వాణీదేవి, పల్లాకు అభినందనలు
సీఎం కేసీఆర్ నాయకత్వానికి ఎదురు లేదని మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీలుగా గెలిచిన వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు అభినందన లు. టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు. వీరి విజయానికి కృషిచేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు.
పల్లా గెలుపు టీఆర్ఎస్ శ్రేణులదే
పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం వెనుక టీఆర్ఎస్ శ్రేణుల కృషి ఎంతో ఉన్నది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సీఎం కేసీఆర్ పారదర్శక పాలన వల్లే పట్టభద్రులు మరోసారి టీఆర్ఎస్కు విజయం కట్టబెట్టారు. రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతున్నది. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీఆర్ఎస్ సాధించిన విజయం తిరుగులేని కేసీఆర్ పాలనకు నిదర్శనం. టీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయం కానేకావు. ఈ విషయం మరోసారి స్పష్టమైంది.
మా బాధ్యతను మరింత పెంచింది
రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు మాకు మరింత బాధ్యతను పెంచింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులతోపాటు వివిధ సంఘాల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి పరిష్కరిస్తాం. సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంచిన పట్టభద్రులందరికీ ధన్యవాదాలు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు సహకరించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, టీఎన్జీవోలు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయ, లెక్చరర్లు, అడ్వకేట్స్తోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు.
ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలు నిదర్శనం
వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు
నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఈ ఫలితాలు గీటురాయిగా నిలిచాయి. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుంది. మెరుగైన పీఆర్సీని ప్రకటిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. వలస జిల్లా పాలమూరు స్వరాష్ట్రంలో పచ్చని మాగాణంగా మారింది.
జాతీయ పార్టీలకు తిరస్కరణ
వాణీదేవి విజయం పట్టభద్రులది.. తెలంగాణ ప్రజలందరిదీ. జాతీయ పార్టీలను తెలంగాణ తిరస్కరించింది. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని చాటిచెప్పారు. కీలక సమయంలో మరోసారి టీఆర్ఎస్ వెంట నిలిచిన పట్టభద్రులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు.
గెలుపు తెలంగాణకు గర్వకారణం
ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు చరిత్రాత్మకం. తెలంగాణ ఠీవీ పీవీ కూతురు విజయం రాష్ర్టానికే గర్వకారణం. సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని పట్టభద్రులు నిజం చేశారు. ఉద్యోగులు కేసీఆర్ పాలనపై గుర్రుగా ఉన్నారని ప్రతిపక్షాలు చేసిన వాదనల్లో ఏ మాత్రం పసలేదని స్పష్టమైంది.
మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు
వాణీదేవికి అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన పట్టభద్రులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువతకు కృతజ్ఞతలు. వాణీదేవిని ఆదరించిన మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను, పాలనను మెచ్చి, నమ్మకంతో ఈ విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు.
మేధావులు వివేకంతో తీర్పునిచ్చారు
బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై వివిధ సందర్భాల్లో వాడిన భాషకు మేధావులు ఓటు ద్వారా తీర్పునిచ్చి సరైన గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా విపక్ష నేతలు కండ్లు తెరిచి రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. విభజన చట్టంలోని అంశాలను అమలుచేసేందుకు, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కృషిచేయాలి. వాణీదేవి గెలుపు తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలు ఇచ్చిన కానుకగా భావిస్తున్నా.
అపురూప బహుమతి
మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమా జం టీఆర్ఎస్ రూపంలో అపురూప కానుకను ఇచ్చింది. సీఎం కేసీఆర్ దార్శనికతను వాణీదేవి గెలుపే కారణం. వాణీదేవికి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు శుభాకాంక్షలు.
అన్ని వర్గాలు టీఆర్ఎస్ వెంటే
అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి సైతం సీఎం కేసీఆర్ రూ.3 వేల కోట్లు నిధులిచ్చి ఆదుకున్న గొప్పు వ్యక్తి. అన్నివర్గాలకు న్యాయం చేయడం ఉద్యమ నాయకుడు కేసీఆర్తోనే సాధ్యం. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ఆధ్వర్యంలో మరింత మేలు జరుగుతుందన్న సంపూర్ణ విశ్వాసం మా అందరికీ ఉన్నది.
థామస్రెడ్డి, టీఎంయూ నేత మద్దతు ఇచ్చాం
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చాం. ఇద్దరినీ గెలిపించుకున్నాం. విజేతలకు మా శుభాకాంక్షలు. సీపీఎస్ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారని నమ్ముతున్నాం.
స్థిత ప్రజ్ఞ, సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి
కేసీఆర్ నాయకత్వానికి ప్రజల అండ
సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు అండగా ఉన్నారని మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీగా గెలుపొందిన వాణీదేవికి అభినందనలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు అందించిన పట్టభద్రులకు పేరుపేరునా ధన్యవాదాలు. వాణీదేవి విజయానికి కృషిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.
వైషమ్యాలు రెచ్చగొట్టేవారికి కర్రుకాల్చివాత
సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ఉన్నది. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే కేసీఆర్ ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం శుభసూచకం. మతాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకునే వారికి పట్టభద్రులు కర్రుకాల్చివాతపెట్టారు. ప్రగతికి పట్టం కట్టిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ గెలుపులో నాకు భాగస్వామ్యం కల్పించిన సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
కేసీఆర్ ఫొటోనే మా గెలుపు మంత్రం
ఎన్నిక ఏదైనా కేసీఆర్ ఫొటోనే మా గెలుపు మంత్రం. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు సంతోషాన్ని ఇచ్చింది. ప్రత్యర్థులు ఎన్ని విద్వేష రాజకీయాలు చేసినా పట్టభద్రులు వాటిని నమ్మలేదు. ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించిన టీజీవో, టీఎన్జీవో, సీపీవో, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలకు, గెలుపు కోసం కృషిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు.
సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం
సీఎం కేసీఆర్ నాయకత్వంపై ముందు నుంచి ఇప్పటివరకు అందరిలోనూ అదే నమ్మకం ఉన్నది. దీనిని మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకత్వానికి తిరుగులేదు. అభివృద్ధి విషయంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు, గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు.
విమర్శకుల నోళ్లు మూత
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి అడుగడుగునా అడ్డుపడుతూ విమర్శలకు దిగుతున్న విపక్ష నేతల నోటికి ఈ ఫలితాలు మూతవేశాయి. పల్లా రాజేశ్వరెడ్డి, వాణీదేవిలది గొప్ప విజయం. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు సత్యాన్ని గ్రహించి అభివృద్ధికి సహకరించి, కేంద్రం నుంచి రావాల్సి నిధుల కోసం పోరాడేందుకు ముందుకురావాలి.
ఐక్యతకు నిదర్శనం
టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు చారిత్రక విజయం. ఉద్యోగులు, ఉద్యమకారులు కలిసి పనిచేసే తీరుకు ఇది నిదర్శనం. ప్రజల సంక్షేమంతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం చేసిన ప్రకటనపై నమ్మక ముంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు.
సీఎం కేసీఆర్పై నమ్మకమున్నది
ఎమ్మెల్సీలుగా గెలిచిన వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డికి శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్పై కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి నమ్మకం ఉన్నది. స్వరాష్ట్రంలోనే మా వేతనాలు పెరిగాయి. ఉద్యోగ భద్రత ఏర్పడింది. సీఎం కేసీఆర్ వల్లే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు నేరుగా సర్కారు నుంచే ఇప్పిస్తారనే నమ్మకం ఉన్నది.