కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు, గురువారం ధర్నాచౌక్ వద్ద చేపట్టిన ధర్నాకు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. యాసంగి వడ్లు కొనాల్సిందేనంటూ బైక్ ర్యాలీలు చేపట్టి.. ధర్నాకు తరలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులపై కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల నుంచి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేదాక పోరాటం సాగిస్తామని అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, మీనాఉపేందర్రెడ్డి, సునీతారాముయాదవ్, శాంతిశ్రీనివాస్రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, సబితాకిశోర్, జ్యోతిగౌడ్, జీఎన్వీ సతీశ్కుమార్, నిరంజన్, పరశురాంరెడ్డి, భాస్కర్, అనిల్కిశోర్, శ్రీనివాస్గౌడ్, కవిత, మమత, బబిత, అరుణ, మౌలాలి డివిజన్ నుంచి భాగ్యనందరావు, సంతోష్నాయుడు, నర్సింగ్రావు, దినేశ్, గణేశ్, కాశప్ప కాశీనాథ్యాదవ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.