హైదరాబాద్, జనవరి 27: టీఆర్ఎస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు గురువారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా జిల్లాల మంత్రులతో వచ్చి ప్రగతిభవన్లో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్రెడ్డి, సం గారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. వారివెంట ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, వొడితెల సతీశ్కుమార్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి ఉన్నారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కే విద్యాసాగర్రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణ, కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి సీఎంను కలిశారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, పీ సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్గౌడ్, అరికెపూడి గాంధీ, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, భేతి సుభాష్రెడ్డి, వక్ఫ్బోర్డు చైర్మన్ సలీమ్తో కలిసి వచ్చి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్, జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తక్కళ్ల్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోతు శంకర్ నాయక్ తదితరులు వారి వెంట ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు సీ లక్ష్మారెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్రెడ్డి, జోగులాంబ-గద్వాల జిల్లా అధ్యక్షుడు జీ కృష్ణమోహన్రెడ్డి మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ఎంపీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు జయపాల్యాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి సీఎంను కలిశారు. కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్సీ దండే విఠల్ ఉన్నారు.
నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణం
స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన ఎల్ రమణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, వంటేరు యాదవరెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం శాసనమండలిలో ప్రొటెం చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీ కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన సభ్యులను రాష్ట్ర మంత్రులు టీ హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వీ శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులకు గుర్తింపు కార్డులు, మండలి నిబంధనల పుస్తకాలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అందించారు.
చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శ
హైదరాబాద్, జనవరి 27: కరోనా వైరస్ బారినపడి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ఫోన్ చేసి పరామర్శించారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, తాను కోలుకొంటున్నానని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపినట్టు సమాచారం.