జమ్మికుంట రూరల్ : హుజురాబాద్ నియోజక వర్గ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్యాదవ్ భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ మండలంలోని బిజిగిరిషరీఫ్ హజ్రత్ సయ్యద్ అంకుషావలి దర్గాలో టీఆర్ఎస్ కార్యకర్త అంకూష్ తలనీలాలను సమర్పించుకున్నాడు. పట్టణ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ అంకూష్ క్రికెట్ క్రీడాకారుడు.
గత ఏడు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో పని చేస్తున్నాడు. ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిలబెట్టిన హుజు రాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ సోమవారం బిజిగిరి అంకుషావలి దర్గాలో అల్లా దీవెనల కోసం ప్రార్ధనలు జరిపాడు. తలనీలాలను సమర్పించి, టీఆర్ఎస్ పార్టీ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.