కమాన్చౌరస్తా, మే 12: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ సైకిల్ యాత్ర చేయడం గొప్ప విషయమని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుడిది శ్రీనివాస్ చేపట్టిన సైకిల్ యాత్రను గురువారం వినోద్కుమార్ తన నివాసంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు బాగుండాలని ఏటా శ్రీనివాస్ యాత్ర చేస్తున్నాడని, గతంలో రాష్ట్ర ఆవిర్భావం కోసం పాదయాత్ర కూడా చేశాడని గుర్తుచేశారు. ఇతరుల బాగు కోసం పాటుబడటంలో ఎంతో సంతోషం ఉంటుందని చెప్పారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం అనంతరం యాదాద్రి చేరుకొంటుందని శ్రీనివాస్ తెలిపారు.