నిన్నటి తరం పిల్లలు ‘చిట్టి చిలకమ్మా… అమ్మ కొట్టిందా..’అని చెబుతుంటే బుద్ధిగా ఊ కొట్టేవారు. కానీ, నయా జనరేషన్ జోలపాట కూడా డిజిటల్గానే కావాలంటున్నారు. డిజిటల్ ఎరా తొలితరంగా పేరుమోసిన ఆల్ఫా జనరేషన్ (2010 తర్వాత పుట్టినవాళ్లు) రాకతో మిలీనియల్స్ జమానాకు చెందిన వాళ్లు పేరెంట్స్గా అవతరించారు. స్మార్ట్ వరల్డ్తో దోస్తీ చేసిన మిలీనియల్స్కి.. ఈ ఆల్ఫా జనరేషన్ ఆలనాపాలనా కత్తి మీద సాములా పరిణమిస్తున్నది. సాంకేతికత, అంతర్జాలం, కృత్రిమ మేధస్సు ఈ తరం పిల్లల జీవితంలో చిన్నప్పటి నుంచే భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో పేరెంటింగ్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. పిల్లల పెంపకంలో పేరెంట్స్ వినూత్న పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఏర్పడింది.
జనరేషన్ ఆల్ఫా పిల్లలు సాంకేతికతతో మమేకమై ఉంటారు. టెక్నాలజీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఏ విషయమైనా ఇట్టే పట్టేసుకుంటారు. ఈ తరానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అవి ఇవే.
పెంపకంలో సవాళ్లు..
త్రిముఖ వ్యూహం..
ఈ డిజిటల్ యుగంలో పిల్లలను పెంచడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇప్పటి తల్లిదండ్రులకు ఎదురవుతున్న అతి పెద్ద సమస్య పిల్లల పెంపకమే! జీవితాల్లో సాంకేతిక చొరబాటు ఎక్కువై మానవ సంబంధాలు తక్కువ అవుతున్న నేపథ్యంలో పిల్లల సామాజిక, భావోద్వేగ సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. పేరెంట్స్ పిల్లల సమగ్ర అభివృద్ధికి కొన్ని పద్ధతులు పాటించాలి.
1. సాంకేతిక సమతుల్యత
2. భావోద్వేగ పెంపకం
3. సమగ్ర అభివృద్ధి
జనరేషన్ ఆల్ఫా పిల్లలను పెంచడం ఒక కొత్త ప్రయాణం. ఆధునిక పద్ధతులు, సాంకేతికతపై అవగాహన, ప్రేమ, సహనం అనే నాలుగు స్తంభాలపై ఆధారపడి తల్లిదండ్రులు తమ పిల్లలను భవిష్యత్ ప్రపంచానికి సిద్ధం చేయాలి. టెక్నాలజీని ఒక సాధనంగా ఉపయోగించుకుంటూ, మానవ సంబంధాలు, విలువను బోధిస్తే ఈ తరం పిల్లలు అద్భుతమైన, సమగ్రమైన పౌరులుగా ఎదుగుతారు.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261