కోల్కతా : బెంగాల్లో కరోజా పంజా విసురుతోంది. వైరస్ బారినపడి సాధారణ జనంతో పాటు ప్రముఖులు సైతం ప్రాణాలు విస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ ఎన్నికల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు కరోనా బారినపడ్డారు. ఇందులో ఇప్పటికే కన్నుమూయగా.. తాజాగా ఖర్దాహ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కాజల్ సిన్హా కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 21న కోల్కతాలోని బెలెఘాటా ఐడీ హాస్పిటల్లో చేర్పించారు. ఈ నెల 23న పరిస్థితి మరింత విషమించింది.
మూడు రోజులుగా వెంటిలేషన్పై ఉంచగా.. ఆదివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఇంతకు ముర్షిదాబాద్లోని షంషేర్గంజ్, జంగిపూర్ నియోజకవర్గాల అభ్యర్థులు మృతి చెందగా.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఖర్దాడా నియోజకవర్గంలో ఆరు విడుతలో భాగంగా ఈ నెల 22న ఎన్నికలు జరిగాయి. కాజల్ సిన్హా మృతిపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్కు గురయ్యానని, ప్రజాసేవ కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు.
ఇవికూడా చదవండి..