రామాయంపేట, ఫిబ్రవరి 14 : గిరిజనులకు సేవాలాల్ మహారాజ్ ఆరాధ్యదైవం. ఆయన బాటలోనే గిరిపుత్రులు నడవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.సోమవారం రామాయంపేట మండలం కోనాపూర్ పెద్ద తండాలో జరుగుతున్న సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు హాజరై గిరిజన మహిళలలో బోనమెత్తుకుని వారితో నృత్యాలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు .ఊరూరా రోడ్డు సౌకర్యంతో పాటు తండాలలో ఏర్పడ్డ నూతన గ్రామ పంచాయతీలకు భవనాలు, ఇతర శాఖలకు చెందిన పక్కా భవనాల నిర్మాణాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేశారన్నారు.
కార్యక్రమంలో రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మండల పార్టీ, పట్టణాధ్యక్షుడు మహేందర్రెడ్డి, తదితరులున్నారు.