హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో విభజించి పాలిం చే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి గిరిజనులు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. ఆలిండియా బంజారా సేవా సం ఘం నూతన కమిటీ బుధవారం హైదరాబాద్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. రిజర్వేషన్లను రాష్ట్రం పెంచుకొనే అవకాశం ఉంటే.. 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు బీజేపీ శాసనసభాపక్ష నేతగా కిషన్రెడ్డి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
మంత్రిని కలిసిన వారిలో ఆలిండియా బం జారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ రామచంద్రునాయక్, అసోసియేట్ అధ్యక్షుడు ఆర్ మోహన్సింగ్, మహిళా అధ్యక్షురాలు సరోజా సింగ్, ఆలిండియా బంజారా సేవా సంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు కిషన్సింగ్ రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుపావత్ కిషన్నాయక్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గోపీచంద్ రాథోడ్, సభ్యులు రాంబాబునాయక్ ఉన్నారు.