తిరుమల,జూలై 2: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేభక్తులకు పారదర్శక సేవలు అందించేందుకు టిటిడి కౌంటర్లను మరింత నైపుణ్యంతో నిర్వహించనున్నట్లు అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. అందుకోసంప్రొఫెషనల్ అనుభవం ఉన్న ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో ఆయన పూజలు నిర్వహించి ఏజెన్సీ సిబ్బందితో లడ్డూ కౌంటర్లలో సేవలను ప్రారంభించారు.