తిరుపతి: జిల్లాలోని ఓజిలి మండలం గ్రద్దకుంటలో విషాదం చోటుచోసుకుంది. సోమవారం సాయంత్రం పశువులను కడిగేందుకు చెరువులో దిగిన తండ్రి చెంగయ్య అందులో కూరుకుపోయాడు. పశువులు ఇంటికి చేరుకున్నప్పటికీ తండ్రి రాకపోవడంతో అనుమానంతో ఈరోజు కుమారుడు నాగార్జున చెరువులో దిగగా ఆయన అందులో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. కుమారుడి మృతదేహం లభ్యం కాగా తండ్రి చెంగయ్య కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.