హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ను కూడా మళ్లించనున్నారు.
-ఎన్టీఆర్ భవన్, అపోలో దవాఖాన, ఫిలింనగర్, బంజారాహిల్స్ వైపు వచ్చే వారు జుబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి రోడ్డు నెం.36, రోడ్డు నెం. 45 రూట్లలో వెళ్లాలని సూచించారు.
-మాసబ్ట్యాంక్ నుంచి రోడ్డు నెం. 12 లోకి వెళ్లే వాహనాలను రోడ్డు నెం. 1, రోడ్డు నెం.10, జహీరానగర్, క్యాన్సర్ దవాఖాన నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్లాలని చెప్పారు.
-ఫిలిం నగర్ నుంచి ఒరిస్సా ఐలాండ్కు వచ్చే వాహనాలు జుబ్లీహిల్స్ చెక్పోస్టు, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ, ఎన్ఎఫ్సీఎల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లాలి.
– మాసబ్ట్యాంక్ నుంచి రోడ్డు నెం.12, జుబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు మెహిదీపట్నం, నానల్నగర్, టోలిచౌక్, ఫిలిం నగర్, జుబ్లీహిల్స్ వైపు వెళ్లాలి.