Proteins | న్యూఢిల్లీ: ప్రొటీన్లను మితిమీరి తీసుకోవడం వల్ల ధమనులు దెబ్బతింటాయని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఆహారం ద్వారా అతిగా ప్రొటీన్లను తీసుకుంటే ధమనుల గోడల్లోనూ, వాటి చుట్టూ కొలెస్ట్రాల్ తదితర పదార్థాలు చేరతాయని, దీని వల్ల ధమనులు కుంచించుకుపోతాయని పరిశోధ కులు తెలిపారు.
రక్త ప్రవాహానికి ఆటంకాలు కలుగడం లేదా ధమనులు పగిలిపోవడం జరుగొచ్చని, తద్వారా రక్తం ముద్దలు కట్టవచ్చని పేర్కొన్నారు. రోజూ ప్రొటీన్ల నుంచి తీసుకునే కేలరీలు 22 శాతానికి మించితే ధమనులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.