ముంబై ,జూన్ 24: ఈరోజు స్టాక్ మార్కెట్లు కాస్త ఊపందుకున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏకంగా 1 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు, రిలయన్స్ఏజీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చేసే ప్రకటన వైపు అందరు చూస్తున్నారు.సెన్సెక్స్ 218.41పాయింట్లు లాభపడి 52,524.49 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 54.10 పాయింట్లు లాభపడి 15,741.05 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టీసీఎస్ 253 శాతం,ఇన్ఫోసిస్ 2.28 శాతం, లార్సన్ 1.58 శాతం, జే ఎస్ డబ్ల్యూ స్టీల్ 1.44 శాతం, మారుతీ సుజుకీ 1.10 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.77 శాతం, ఐచర్ మోటార్స్ 1.20 శాతం, రిలయన్స్ 1.17 శాతం, సిప్లా 1.17, అదానీ పోర్ట్స్ 1.14 శాతం నష్టపోయాయి