రైతన్న కోసం పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయమై.. కర్షకులకు వ్యతి రేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని ధ్వజ మెత్తారు. కేంద్రం తీరును నిరసిస్తూ బుధవారం ఉదయం నుంచి పార్లమెంట్లో పోడియం వద్ద రోజంతా ధర్నాకు దిగారు. స్పష్టమైన హామీ కోసం పట్టుబట్టారు. దీన్ని రైతులు ప్రశంసిస్తున్నారు. కేంద్రం తీరు దేశం మొత్తానికి తెలిసేలా నిరసన వ్యక్తం చేశారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి సైతం రైతుల కోసం తమ ఆందోళన కొనసాగించడాన్ని పాలమూరు రైతులు స్వాగతిస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మాత్రం రైతుకు మద్దతుగా నిలవలేదు. దీన్నిబట్టి టీఆర్ఎస్ ముమ్మాటికీ రైతు పక్షపాతే అని అర్థమైంది.
గద్వాల, డిసెంబర్ 1 : జోగుళాంబ గద్వాల జిల్లాకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తన తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతి చెందగా.. కుటుంబ సభ్యులను పరామర్శించడానికి విచ్చేస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి చేరుకొని తన తండ్రికి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు రానున్నారని తెలిపారు. అయితే వెంకట్రామిరెడ్డి వైకుంఠ సమారాధనకు హాజరుకావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు.