బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. కరోనా ఆంక్షల నడుమ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న ఈ లీగ్లో బుధవారం సెమీఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఫైనల్ బెర్త్ కోసం నాలుగు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్లో టేబుల్ టాపర్ పట్నా పైరేట్స్ యూపీ యోధతో తాడోపేడో తేల్చుకోనుండగా.. మరో ఎలిమినేటర్లో దబాంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ ఢీకొట్టనుంది. ఫైనల్లో అడుగుపెట్టేందుకు జట్లు ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగుతున్నాయి.
ఈ సీజన్లో అత్యధికంగా 16 విజయాలతో జోరు మీదున్న పట్నా పైరేట్స్ నాలుగో టైటిల్పై కన్నేసింది. ఈసారి ట్రోఫీని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పట్నా తహతహలాడుతున్నది. బెంగళూరును చిత్తు చేసి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఢిల్లీ ఉంది. ఈనెల 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
నేటి మ్యాచ్లు
తొలి ఎలిమినేటర్: పట్నా పైరేట్స్ X యూపీ యోధ
రెండో ఎలిమినేటర్ : దబాంగ్ ఢిల్లీ X బెంగళూరు బుల్స్
రాత్రి:7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో