ముంబై,జూన్ 16: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నాలుగు సెషన్లుగా వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ 1 శాతం నుంచి 5 శాతం మేర క్షీణిస్తుండగా ,ఎఫ్ంసీజీ కొనుగోళ్ల ఒత్తిడిని ఎదుర్కోగా, మెటల్, పవర్ సూచీలు ఒక శాతం మేర నష్టపోయాయి. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలు ఆశించినట్లుగా లేకపోవడంతో ఆసియా మార్కెట్లు ఈరోజు అప్రమత్తంగా కదులుతున్నాయి.